
ప్రతీకాత్మక చిత్రం
ఉత్తర్ ప్రదేశ్ : ఉన్నావో జిల్లాలో చకాలవాన్షి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పికప్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమత్తం ఉన్నావో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.