‘20 కోట్లు ఇవ్వకుంటే.. రహస్యాలన్నీ బయటపెడతా’ | Vijay Shekhar Sharma Secretary Blackmailed Him After Stealing Data | Sakshi
Sakshi News home page

పేటీఎం చీఫ్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసిన ఉద్యోగిని

Oct 23 2018 1:01 PM | Updated on Oct 23 2018 2:40 PM

Vijay Shekhar Sharma Secretary Blackmailed Him After Stealing Data - Sakshi

సోనియా ధావన్‌ , పేటీఎం చీఫ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ

విజయ్‌ శేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన లాప్‌టాప్‌, మొబైల్‌, ఆఫీస్‌ కంప్యూటర్లను వినియోగించేది.

సొంత కంపెనీలో డాటా బ్రీచ్‌కు పాల్పడింది పేటీఎం చీఫ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ వ్యక్తిగత కార్యదర్శి సోనియా ధావన్‌. అంతేకాకుండా 20 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే ఆ సమాచారన్నంతా బహిర్గతం చేస్తానంటూ ఆయనను బ్లాక్‌మెయిల్‌ చేసింది. ఈ విషయమై కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నోయిడాలో కంపెనీ కార్యాలయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పేటీఎం నోయిడా విభాగం ధ్రువీకరించింది. విచారణ పూర్తయ్యేంత వరకు పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొంది.

బాస్‌ ఫోన్‌, లాప్‌టాప్‌ల నుంచి..
పేటీఎం స్థాపించిన నాటి నుంచి సోనియా ఆ సంస్థలోనే పనిచేస్తోంది. విజయ్‌ శేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన లాప్‌టాప్‌, మొబైల్‌, ఆఫీస్‌ కంప్యూటర్లను వినియోగించేది. ఈ క్రమంలోనే కంపెనీతో పాటు విజయ్‌ వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆమె దొంగిలించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన డేటా మొత్తాన్ని రోహిత్‌ కోమల్‌ అనే వ్యక్తికి చేరవేసింది. ఈ నేపథ్యంలో అతడు విజయ్‌ సోదరుడు, పేటీఎం వైస్ ప్రెసిడెంట్‌ అజయ్‌ శేఖర్‌ శర్మకు ఫోన్‌ చేశాడు. ‘20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే డేటాను బహిర్గతం చేసి ప్రజల్లో పేటీఎంకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తామంటూ’ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఈ విషయాన్ని అజయ్‌ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. కాగా సోనియా సహా ఆమెకు సహకరించిన వ్యక్తులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement