నష్టాల్లో సెన్సెక్స్!
మార్కెట్లో బుల్ ర్యాలీకి మంగళవారం తాత్కాలికంగా తెరపడింది.
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కాలంగా కొనసాగుతున్న బుల్ ర్యాలీకి మంగళవారం తాత్కాలికంగా తెరపడింది. ఐటీ, టెక్నాలజీ, రియాల్టీ, మెటల్, పవర్, బ్యాంకింగ్, ఆటో రంగాల కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ప్రధాన సూచీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
ఓదశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,347, నిఫ్టీ 7,579 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. అయితే మధ్యాహ్నం సమయానికి ఆరంభంలో నమోదు చేసిన నష్టాల్ని కొంత తగ్గించుకుని సెన్సెక్స్ 79 పాయింట్ల నష్టంతో 25501 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల పతనంతో 7,626 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో టెక్ మహీంద్ర అత్యధికంగా 3.43 శాతం, విప్రో 2.34 శాతం, సిప్లా 2.13, హెచ్ సీఎల్ టెక్ 2.12, లుపిన్ 1.99 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్ 3.96 శాతం, సెసా గోవా 3.62 శాతం, టాటా స్టీల్ 3.30 శాతం, భెల్ 3.04, టాటా పవర్ 2.94 శాతం నష్టపోయాయి.