సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టం!
ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 24549 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 7318 వద్ద ముగిసాయి.
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 24549 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 7318 వద్ద ముగిసాయి. ఓదశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 24,777 గరిష్టస్థాయిని, 24,422 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది.
జిందాల్ స్టీల్ అత్యధికంగా 5.96 శాతం, టెక్ మహేంద్ర 2.72, టాటా స్టీల్ 2.13, హిందాల్కో 1.73, అల్ట్రాటెక్ సిమెంట్ 1.30 లాభపడ్డారు. గెయిల్ 7.53 శాతం, భెల్ 5.21, పీఎన్ బీ 2.73 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.71, ఎస్ బీఐ 2.69 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.