మూడో రోజు కూడా సెన్సెక్స్...
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిసాయి.
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 80 పాయింట్లు లాభపడి 25,641 వద్ద, నిఫ్టీ 7,663 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 25,713 పాయింట్ల గరిష్ట స్థాయిని, 25,441 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఐడీఎఫ్ సీ, టీసీఎస్, హీరో మోటో కార్ప్, కొటాక్ మహీంద్ర, హెచ్ సీఎల్ టెక్ లు లాభాల్ని నమోదు చేసుకోగా, టాటా పవర్, అంబుజా సిమెంట్స్, హిండాల్కో, భెల్, గెయిల్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి.