326 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్!
ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి.
హైదరాబాద్: ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి.
ఇరాక్ లో అతిపెద్ద రిఫైనరీపై మిలిటెంట్లు దాడులు జరపడంతో చమురు రంగ కంపెనీల షేర్లు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. దాంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టంతో 25194 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 7558 వద్ద ముగిసాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సిప్లా 2.94 శాతం, హిండాల్కో 2.55, కొటాక్ మహీంద్ర 2.45, లుపిన్ 2.34, యునైటెడ్ స్పిరిట్స్ 2.01 శాతం నష్టపోయాయి. బీపీసీఎల్ 3.04, ఐడీఎఫ్ సీ 2.77, భెల్ 2.60, సన్ ఫార్మా 2.53, ఎన్ ఎమ్ డీసీ 2.45 శాతం నష్టాలతో ముగిసాయి.