భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిసాయి
స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు
Sep 9 2014 7:24 PM | Updated on Sep 2 2017 1:07 PM
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. మధ్యాహ్నం నమోదు చేసుకున్న నష్టాల నుంచి తేరుకుంది. చివరకు సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 27265 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8152 వద్ద ముగిసాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్, సిప్లా, కోల్ ఇండియా, టాటా మోటర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీలు లాభాల్లో, టెక్ మహీంద్ర, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్, డీఎల్ఎఫ్ కంపెనీలు నష్టాల్లో ముగిసాయి.
Advertisement


