స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 73 పాయింట్ల లాభంతో 25715 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల వృద్దితో 7684 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా ఇండస్ ఇండియా బ్యాంక్ 3.21 శాతం, హెచ్ డీఎఫ్ సీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, గ్రాసీం కంపెనీలు 2 శాతానికి పైగా లాభాల్నినమోదు చేసుకున్నాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,861 గరిష్ట స్థాయిని, 25,677 కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7,722 గరిష్ట స్థాయిని, 7,674 కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది.
డీఎల్ఎఫ్, ఐడీఎఫ్ సీ, టాటా పవర్, గెయిల్, ఇన్ఫోసిస్ కంపెనీలు సుమారు రెండు శాతం నష్టపోయాయి.