డ్యూయల్‌ రియర్‌ కెమెరాతో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ | Samsung Galaxy J7 Duo Smartphone Launched | Sakshi
Sakshi News home page

డ్యూయల్‌ రియర్‌ కెమెరాతో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌

Apr 12 2018 12:21 PM | Updated on Apr 12 2018 12:23 PM

Samsung Galaxy J7 Duo Smartphone Launched - Sakshi

శాంసంగ్‌ గెలాక్సీ జే7 డ్యూ స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం శాంసంగ్‌ మరో కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ‘శాంసంగ్‌ గెలాక్సీ జే7 డ్యూ’  పేరుతో రూ.16,990కు దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో వచ్చిన తమ తొలి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని శాంసంగ్‌ ప్రకటించింది. 13 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్‌ షూటర్‌ 8 మెగాపిక్సెల్‌గా ఉంది. నలుపు రంగు ఆప్షన్‌లో ఇది మార్కెట్‌లో లభ్యమవుతుంది.

గెలాక్సీ జే7 డ్యూ ఫీచర్లు...
5.5 అంగుళాల హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌ డిస్‌ప్లే
1.6గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
4జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఫిజికల్‌ హోమ్‌ బటన్‌ వద్ద ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement