మరో చారిత్రక కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరో చారిత్రక కనిష్టాన్ని తాకింది. డాలరు మారకంలో వరసగా పతనమవుతూ వస్తున్న రూపాయి బుధవారం భారత మార్కెట్లో మొదటిసారి 73 స్థాయికి పతనమైంది. సోమవారం నాటి ముగింపు 72.91తో పోలిస్తే 81 పైసలు నష్టపోయిన రూపాయి 73.30వద్ద కొనసాగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 175 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ కూడా 60 పాయింట్లు నష్టపోయింది.
మరిన్ని వార్తలు