
ఈసీఐఎల్కు రూ.68కోట్ల లాభం
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,456కోట్ల టర్నోవర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,456కోట్ల టర్నోవర్ సాధించినట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు సంస్థ రూ.68కోట్ల లాభం ఆర్జించిందని, గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.31కోట్లు (120శాతం)అధికమని పేర్కొన్నారు. ఆదాయపన్ను చెల్లింపు తర్వాత సంస్థ నికర లాభం రూ.47కోట్లుగా తేలిందని, ఈ డివిడెండ్ మొత్తాన్ని మంగళవారం ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈసీఐఎల్ సీఎండీ పి.సుధాకర్, డెరైక్టర్లు విఎస్బి బాబు, కిషోర్ రుంగ్తా తదితరులు భారత ప్రభుత్వ కార్యదర్శి, అణు ఇంధన కమిషన్ చైర్మన్ ఆర్.కె.సిన్హాకు చెక్కు రూపంలో అందజేసినట్లు వెల్లడించారు.