p. Sudhakar
-
టీడీపీ ఎన్నికల హామీలు అమలు చేయాలి
ఎచ్చెర్ల: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి యూనివర్సిటీల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్ అసిసెంట్ ప్రొఫెసర్లకు న్యాయం చేయాలని రాష్ట్ర కాంట్రాక్ట్ బేసిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ పి. సుధాకర్ డిమాండ్ చేశారు. వర్సిటీలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్ అసోషియేట్లు, అధ్యాపకులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కామర్స్ మేనేజ్ మెంట్ సెమినార్ హాల్లో మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 990 మంది కాంట్రాక్ట్ బోధకులుగా 13 జిల్లాల్లో వర్సిటీల్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. వీరు శ్రమ దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే రిక్రూట్ మెట్లలో వీరికి వెయిటేజీ ఇవ్వాలని, పదేళ్లకు మించి పనిచేస్తున్న అర్హులైన వారిని రెగ్యులర్ చేయాలని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు డాక్టరేట్ ఉన్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ. 46500 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని వర్సిటీల్లో యూనియన్లు బలోపేతం చేసి భవిష్యత్తులో పోరాట తీవ్రత పెంచుతాయన్నారు. సమావేశంలో రాష్ట్ర యూనియన్ కార్యదర్శి రవిశంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎన్. సంతోష్ రంగనాథ్, కరుణానిధి, యు. శాంతి, జయలక్ష్మి, ఫిజికల్ డెరైక్టర్ ఎం. శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ పునరుద్ధరణ వర్సిటీలో గతంలో టీచింగ్ అసోసియేట్ యూనియన్ను 2013లో రద్దు చేశారు. మళ్లీ ఈ యూనియన్ పునరుద్ధరించాల ని ఈ సమావేశంలో నిర్ణయించారు. అ న్ని యూనివర్సిటీల్లో యూనియన్లున్నాయని, అంబేద్కర్ యూనివర్సిటీలో సై తం యూనియన్ ఏర్పాటు చేయవల్సి న అవసరం ఉందని రాష్ట్రనాయకత్వం అభిప్రాయ పడింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కాం ట్రాక్ట్ బేసిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనియన్ ఏర్పడింది. అధ్యక్షునిగా ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ కోర్సు కో-ఆర్డినేటర్ డాక్టర్ హనుమంతు సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా ఎంఎల్ఐఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. గోవిందరాజులను ఏక గ్రీవంగా ఎన్ను కున్నారు. కాంట్రాక్ట్ బోధకులకు న్యాయం జరిగేవరకూ పోరాడాలని తీర్మానించారు. -
ఈసీఐఎల్కు రూ.68కోట్ల లాభం
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,456కోట్ల టర్నోవర్ సాధించినట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు సంస్థ రూ.68కోట్ల లాభం ఆర్జించిందని, గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.31కోట్లు (120శాతం)అధికమని పేర్కొన్నారు. ఆదాయపన్ను చెల్లింపు తర్వాత సంస్థ నికర లాభం రూ.47కోట్లుగా తేలిందని, ఈ డివిడెండ్ మొత్తాన్ని మంగళవారం ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈసీఐఎల్ సీఎండీ పి.సుధాకర్, డెరైక్టర్లు విఎస్బి బాబు, కిషోర్ రుంగ్తా తదితరులు భారత ప్రభుత్వ కార్యదర్శి, అణు ఇంధన కమిషన్ చైర్మన్ ఆర్.కె.సిన్హాకు చెక్కు రూపంలో అందజేసినట్లు వెల్లడించారు. -
స్వదేశంలో పనిచేస్తే.. అగ్రస్థానంలో ఉంటాం
నిట్ టెక్నోజియాన్ ముగింపు కార్యక్రమంలో ఈసీఐఎల్ చైర్మన్ పి.సుధాకర్ హన్మకొండ : ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల్లో ప్రతి ఏటా కనీసం వెయ్యి మంది విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారనీ, అలాకాకుండా.. వారంతా స్వదేశంలో పనిచేస్తే శాస్త్రసాంకేతిక రంగాల్లో మనదేశం అగ్రరాజ్యాన సరసన నిలుస్తుందని ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పి.సుధాకర్ అన్నారు. వరంగల్ నిట్లో టెక్నోజియాన్ -2014 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లోనే సాంకేతిక సహకారం అవసరమయ్యేదన్నారు. నేటి గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్లో ప్రతి అంశంలోనూ సాంకేతిక సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులు తమ జీవితాన్ని ఓ ప్రయోగశాలగా భావించాలనీ, అప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా యువ ఇంజనీర్లు ఎదగాలని ఆకాంక్షించారు. నేటి ఎన్నికల వ్యవస్థ్యను సరళతరం చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం)ను రూపొందించింది ఈసీఐఎల్లోనే అని తెలిపారు. త్వరలో 700 మెగావాట్ల న్యూక్లియర్ పవర్ప్లాంట్ను ఈసీఐఎల్ ఆధ్వర్యంలో దేశంలో నెలకొల్పనున్నట్లుగా వెల్లడించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో అగ్ని మిసైల్ ప్రోగాంై డెరెక్టర్ వీజే శేఖరన్ మాట్లాడుతూ నానో టెక్నాలజీకి అనుగుణంగా రాబోయే రోజుల్లో సరికొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.అగ్ని, ఆకాశ్, అస్త్రా క్షిపణుల పనితీరును విద్యార్థులకు వివరించారు. వరంగల్ నిట్లో మూడు రోజుల పాటు జరిగిన టెక్నోజియాన్ -2014కు అంచనాలకు మించి స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,500 మంది విద్యార్థులు ఈ టెక్నికల్ ఫెస్ట్కు వస్తారని అంచనా వేయగా... అంతకు రెట్టింపు సంఖ్యలో 6,500 మంది హాజరయ్యారు. నిట్ విద్యార్థులతో కలిపి మొత్తం పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో నిట్ ప్రాంగణం కళకళలాడింది. -
ఎన్నికల విజయవంతంపై ‘ఈసీఐఎల్’ హర్షం
‘సక్సెస్ స్టోరీ’ పేరిట ప్రకటన విడుదల చేసిన యాజమాన్యం కుషాయిగూడ, న్యూస్లైన్: దేశవ్యాప్తంగా తొమ్మిది విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు విజయవంతం కావడంపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ పి.సుధాకర్ తమ సిబ్బందిని అభినందిస్తూ, తాము సాధించిన విజయాన్ని వివరిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈవీఎంల తయారీ, రవాణా, పనితీరు తదితర అంశాలతో కూడిన ఫొటోలను కూడా జతపరచి, అణు ఇంధన శాఖకు చెందిన వివిధ సంస్థలతో పాటు నగరంలోని పలు ప్రభుత్వ సంస్థలకు, మీడియాకు ప్రకటన ప్రతులను పంపించారు. 980 నుంచి మొదలైన ఈవీఎం ప్రస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా చేపట్టడంలో ఈసీఐఎల్ సంస్థ పాత్ర ఎనలేనిది. ఈవీఎంల తయారీలో బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) కూడా పోటీ పడుతున్నా, సింహభాగం ఈసీఐఎల్దే. ఈ రెండు సంస్థలు తయారు చేసిన ఈవీఎంలను మూడో పార్టీ (థర్డ్పార్టీ)గా వాటి పనితీరును పరిశీలించి సర్టిఫై చేసే సంస్థ ‘ఈటీడీసీ’ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసేదే. భారత ముఖ్య ఎన్నికల అధికారి కోరిక మేరకు 1980లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) పనితీరును వివరించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో తనవంతు సేవలనందిస్తున్న ఈసీఐఎల్.. ఇప్పటి వరకు దాదాపు నాలుగు లక్షల ఈవీఎంలను రూపొందించింది. మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే వీలున్న ఈవీఎంల తయారీతో ప్రతి ఎన్నికల్లోనూ బ్యాలెట్ పేపర్ల తయారీకి అయ్యే ఖర్చును తగ్గించడమే కాకుండా, పేపర్ వినియోగం లేకుండా చేయడంతో పర్యావరణానికి కూడా మేలు చేసినట్లయింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా ‘నోటా’ పేరిట ‘పై అభ్యర్థులు ఎవరూ కాదు’ అనే ఆప్షన్ను కూడా అమర్చడం జరిగింది. భూటాన్, నేపాల్ వంటి దేశాలకు కూడా ఈవీఎంలను తయారు చేసి ఎగుమతి చేసిన ఈసీఐఎల్, యూరప్లోని కొన్ని దేశాలకు ఈవీఎంలను ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తుండటం కొసమెరుపు.