వచ్చే వారంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పత్రాలు దాఖలు! | NSE to file for IPO by Dec 20 | Sakshi
Sakshi News home page

వచ్చే వారంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పత్రాలు దాఖలు!

Dec 15 2016 2:00 AM | Updated on Sep 4 2017 10:44 PM

వచ్చే వారంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పత్రాలు దాఖలు!

వచ్చే వారంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పత్రాలు దాఖలు!

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ ముసాయిదా పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి వచ్చే వారంలో సమర్పించే అవకాశాలున్నాయి.

ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో షేర్ల జారీ   
న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ ముసాయిదా పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి వచ్చే వారంలో సమర్పించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఎన్‌ఎస్‌ఈ అధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద ఐపీఓ అన్న అంచనాలున్నాయి. ఈ ఐపీఓలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో వాటాలున్న పలు కంపెనీలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో తమ వాటాను విక్రయించనున్నాయి.

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సన్నాహాల నేపథ్యంలో ఆశ్చర్యకరంగా ఎన్‌ఎస్‌ఈ సీఈఓ చిత్ర రామకృష్ణన్‌ తన పదవికి ఈ మధ్యే రాజీనామా చేశారు. కాగా ఈ ఐపీఓ కోసం ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే లిస్టింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి, మర్చంట్‌  బ్యాంకర్లను కూడా నియమించింది. సిటిగ్రూప్, మోర్గాన్‌ స్టాన్లీ, జేఎం ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ సెక్యూరిటీస్, కోటక్‌  మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీలు ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. స్టాక్‌ ఎక్స్చేంజ్ ల్లో లిస్టింగ్‌ కానున్నామని ఈ ఏడాది జూన్‌లోనే ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. మరో స్టాక్‌ ఎక్స్చేంజ్ బీఎస్‌ఈ కూడా ఐపీఓకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement