మార్కెట్లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీటీ ఎస్ | Mercedes-Benz launches AMG GT S sports car | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీటీ ఎస్

Nov 25 2015 2:17 AM | Updated on Sep 3 2017 12:57 PM

మార్కెట్లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీటీ ఎస్

మార్కెట్లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీటీ ఎస్

లగ్జరీ కార్లు తయారు చేసే జర్మనీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారును మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది.

ధర రూ. 2.4 కోట్లు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్లు తయారు చేసే జర్మనీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారును మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఏఎంజీ జీటీ ఎస్ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.2.4 కోట్లు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది.  15 కొత్త కార్లను భారత మార్కెట్లోకి అందిస్తామని ఈ ఏడాది మొదట్లోనే చెప్పామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోల్గార్ పేర్కొన్నారు.  దీంట్లో భాగంగానే ఈ కొత్త కారును తెచ్చామని, ఈ ఏడాది తామందిస్తున్న 14వ కొత్త కారు ఇదని వివరించారు.

4-లీటర్ బై-టర్బో ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఆడాప్టివ్ బ్రేక్ లైట్స్, కాంపొజిట్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ చైల్డ్ సీట్ రికగ్నిషన్ వంటి ప్రత్యేకతలున్నాయని చెప్పారు.  భారత్‌లో అమ్ముడవుతున్న ఏఎంజీ కార్లలో అత్యంత వేగవంతమైన కారు ఇదే. గరిష్ట వేగం గంటకు 310 కి.మీ. 0-100 కి.మీ. వేగాన్ని 3.8 సెకన్లలోనే అందుకోగలుగుతుంది. ఇతర వాహనాలను ఢీకొట్టకుండా చూసే కొలిజన్ ప్రివెన్షన్ అసిస్ట్ ప్లస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement