కొత్త వేదికలతో కేరళ టూరిజం.. | Kerala Tourism plans virtual reality kiosks at major airports | Sakshi
Sakshi News home page

కొత్త వేదికలతో కేరళ టూరిజం..

Jan 18 2017 2:08 AM | Updated on Sep 5 2017 1:26 AM

కొత్త వేదికలతో కేరళ టూరిజం..

కొత్త వేదికలతో కేరళ టూరిజం..

పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏటా అయిదారు కొత్త ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నట్టు కేరళ టూరిజం వెల్లడించింది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏటా అయిదారు కొత్త ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నట్టు కేరళ టూరిజం వెల్లడించింది. ప్రస్తుతం 100కుపైగా కేంద్రాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయని సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ కె.పి.నందకుమార్‌ తెలిపారు. టూర్‌ ఆపరేటర్లు, ఏజెన్సీలతో కేరళ టూరిజం రోడ్‌షో నిర్వహించిన సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వైల్డ్‌లైఫ్, హిల్‌ స్టేసన్స్, బీచెస్, బ్యాక్‌వాటర్స్‌ వంటివి ప్రమోట్‌ చేస్తున్నట్టు గుర్తు చేశారు.

ఇందుకోసం పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల వారు వివాహాలను కేరళలో జరపడం పెరుగుతోందని అన్నారు. ఇటువంటివి ఏటా 500లకుపైగా జరుగుతున్నాయని తెలిపారు. గతేడాది 10 లక్షల మంది విదేశీ, 1.35 కోట్ల మంది దేశీయ పర్యాటకులు కేరళలో అడుగు పెట్టారని చెప్పారు. 2015తో పోలిస్తే గతేడాది సెప్టెంబరులో పర్యాటకుల సంఖ్య 5–6 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. విభిన్న పర్యాటక ప్రదేశాలతో టూరిస్టుల సంఖ్య పరంగా దేశంలో కేరళ తొలి స్థానంలో ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement