మెడికల్ టూరిస్టులకు త్వరలో ఈ-వీసా! | Govt to issue e-visa for medical tourists | Sakshi
Sakshi News home page

మెడికల్ టూరిస్టులకు త్వరలో ఈ-వీసా!

Jun 4 2016 12:35 AM | Updated on Oct 9 2018 7:52 PM

మెడికల్ టూరిస్టులకు త్వరలో ఈ-వీసా! - Sakshi

మెడికల్ టూరిస్టులకు త్వరలో ఈ-వీసా!

విదేశీయులు భారత్‌లో మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం సులభతరం కానున్నది.

న్యూఢిల్లీ: విదేశీయులు భారత్‌లో మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం సులభతరం కానున్నది. కేంద్ర ప్రభుత్వం భారత్‌కు వైద్య చికిత్సల కోసం వచ్చే పర్యాటకుల కోసం త్వరలో ఈ-వీసాలను జారీ చేయనున్నది. దేశంలో మెడికల్ టూరిజం మార్కెట్ 3 బిలియన్ డాలర్లు ఉంటుందని అం చనా. ఇది 2020 నాటికి 7-8 బిలియన్ డాలర్లకి చేరే అవ కాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ-వీసాల జారీ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్‌కు వైద్యం కోసం వచ్చే విదేశీయులకు త్వరలో ఈ-వీసాల జారీ ఉంటుందని హోం  శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. విదేశాల నుంచి వైద్యం కోసం ఇండియాకు వచ్చిన వారు 2012, 2013, 2014లో వరుసగా 1.71 లక్షలు, 2.36 లక్షలు, 1.84 లక్షలుగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement