వారి ఓట్లు కావాలి కానీ... ప్రాతినిధ్యం వద్దా? | ysrcp mals takes on congress, tdp | Sakshi
Sakshi News home page

వారి ఓట్లు కావాలి కానీ... ప్రాతినిధ్యం వద్దా?

Jan 28 2014 12:04 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్, టీడీపీలు ఎస్సీ, ఎస్టీలను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించకపోవడం దారుణమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

హైదరాబాద్ : కాంగ్రెస్, టీడీపీలు ఎస్సీ, ఎస్టీలను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించకపోవడం దారుణమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వరూప్, బాబూరావు, శ్రీనివాసులు, బాలరాజు మండిపడ్డారు.  దళితులు, గిరిజనులు అంటే కాంగ్రెస్, టీడీపీలకున్న చిత్తశుద్ధి ఇదేనా అని వారు ప్రశ్నించారు. 

కోట్లు ఖర్చు పెట్టేవారికే టికెట్లిస్తారా అంటూ వారు మంగళవారమిక్కడ సూటిగా ప్రశ్నలు సంధించారు.  ఎస్సీ, ఎస్టీల ఓట్లు కావాలి కాని..  పెద్దల సభలో వారికి ప్రాతినిథ్యం వద్దా అన్న వైఎస్‌ఆర్‌సీపీ.. కాంగ్రెస్, టీడీపీల వ్యవహారశైలి సిగ్గు చేటన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement