విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీస్తే సహించం | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ కోసమే చంద్రబాబు చైతన్య యాత్ర..

Published Sat, Feb 29 2020 2:53 PM

YSRCP Leader Vamsi Krishna Srinivas Fires On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ ను దెబ్బ తీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్‌ ఘటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో మహా నగరం కాబోతుందన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎయిర్ పోర్ట్ ఘటన తో ఇప్పటికైనా చంద్రబాబు లో మార్పు రావాలని హితవు పలికారు. మార్పు రాకపోతే రాబోయే కార్పొరేషన్లు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారన్నారు. విశాఖ ప్రజలను గుండాలుగా చిత్రీకరిస్తున్నారని.. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తే తీవ్రంగా పరిగణిస్తామని వంశీకృష్ణ శ్రీనివాస్‌ హెచ్చరించారు.

Advertisement
Advertisement