282వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 282th Day PrajaSankalpaYatra Begins | Sakshi
Sakshi News home page

Oct 9 2018 8:43 AM | Updated on Oct 9 2018 11:08 AM

YS Jagan 282th Day PrajaSankalpaYatra Begins - Sakshi

సాక్షి, చీపురుపల్లి : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగుతోంది. మంగళవారం ఉదయం జననేత 282వ రోజు పాదయాత్రను గుర్ల మండలం గరికవలస నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి గజపతి నగరం నియోజకవర్గంలోని కెంగువ, ముచ్చెర్ల, కొండపేట క్రాస్‌ మీదుగా జిన్నం వరకూ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది.  

జననేత వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్‌ జగన్, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement