చంద్రబాబుకు ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ | ys avinash reddy letter to cm chandrababu gandikota project issues | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ

Dec 10 2016 8:09 PM | Updated on Aug 14 2018 11:26 AM

చంద్రబాబుకు ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ - Sakshi

చంద్రబాబుకు ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.

కడప: గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గాలేరి-నగరి సుజల స్రవంతి పథకంలో భాగమైన గండికోట ప్రాజెక్టు నిర్మాణం వల్ల చౌటుపల్లి గ్రామం ముంపునకు గురవుతుందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తన లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా ఆ ప్రాజెక్టు సాధనలో టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించలేదని గతంలోనూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement