చార్జింగ్ పెడుతూ..యువకుడి మృతి | youth dead in visakha district due to cell phone charging | Sakshi
Sakshi News home page

చార్జింగ్ పెడుతూ..యువకుడి మృతి

Mar 30 2016 4:48 PM | Updated on Sep 18 2019 3:24 PM

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

విశాఖపట్టణం: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. చింతపాడు మండలం మేడూరు గ్రామంలో బుధవారం ఉదయం సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో పాండు(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement