దారి దోపిడికి పాల్పడుతున్న మహిళలు, హిజ్రా అరెస్ట్ | Women, Hijra arrested in highway robbery in Guntur district | Sakshi
Sakshi News home page

దారి దోపిడికి పాల్పడుతున్న మహిళలు, హిజ్రా అరెస్ట్

Jul 19 2014 8:32 AM | Updated on Aug 30 2018 5:27 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై వాహనదారులను బెదిరించి దోపిడికి పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై వాహనదారులను బెదిరించి దోపిడికి పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని... వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ముఠాలో ఐదుగురు మహిళలు, ఇద్దరు యువకులతోపాటు హిజ్రా కూడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎప్పటిలాగే ఈ దొంగల ముఠా దారికాచి వాహనదారులపై దాడి చేసి నగదు దొంగిలిస్తుంది. అలాగే శనివారం తెల్లవారుజామున దారికాచి వాహనదారులపై దాడి చేశారు. దాంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు దొంగలను పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement