భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టు | wife and her lover arrested in husband murder case | Sakshi
Sakshi News home page

భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టు

Mar 18 2015 9:37 PM | Updated on Aug 20 2018 4:27 PM

భర్తను హత్య చేసిన కేసులో భార్యను, ఆమె ప్రియుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

బ్రహ్మంగారిమఠం (కర్నూల్): భర్తను హత్య చేసిన కేసులో భార్యను, ఆమె ప్రియుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మంసాగర్ సమీపంలో ఉన్న కొత్తబసవాపురం గ్రామంలో ఈ నెల 8న వంగ జయరామానాయుడిని ఆయన భార్య, ఆమె ప్రియుడు హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ నెల 7వతేదీన జయ రామానాయుడు లారీకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంట్లో భార్య వెంకటలక్ష్మీ, ఆమె ప్రియుడు సోమయ్యలు ఉండటం గమనించాడు.

ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో భర్తను వెంకటలక్ష్మీ గొడ్డలితో కొట్టింది. జయరాముడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రియుడు సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చికిత్స కోసం భర్తను తీసుకెళుతుండగా రాజంపేట వద్ద మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి మైదుకూరు రూరల్ సి.ఐ నాగభూషణం చొరవతో హత్యకు సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించి వెంటలక్ష్మి, ఆమె ప్రియుడు సోమయ్యలను 302, 201 సెక్షన్‌ల కింద అరెస్టు చేశామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement