వరదల పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ | West Godavari Collector review the flood situation | Sakshi
Sakshi News home page

వరదల పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్

Aug 6 2013 8:47 PM | Updated on Sep 1 2017 9:41 PM

జిల్లా అధికారులతో వరదల పరిస్థితిని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ సమీక్షించారు.

ఏలూరు: జిల్లా అధికారులతో వరదల పరిస్థితిని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్  సమీక్షించారు.  రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలను కలెక్టర్ కోరారు.  ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను 600  మంది సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.  అత్యవసర సేవల కోసం 50 పడవలను సిద్ధంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు.

 పోలవరం మండలంలోని ముంపు గ్రామాలను రేపు కలెక్టర్  సందర్శించనున్నారు.  వరద బాధితులకు 25  కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement