కుప్పమా.. మజాకా | Vaidyasakha 53 more abrupt transfers | Sakshi
Sakshi News home page

కుప్పమా.. మజాకా

Aug 19 2014 1:52 AM | Updated on Sep 2 2017 12:04 PM

సీఎం నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండరాదనే ఉద్దేశంతో జిల్లాలోని పలువురు వైద్య సిబ్బందిని బదిలీ చేస్తూ కలెక్టర్ సిద్ధార్థజైన్ హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు.

  •      మీరంతా వెంటనే ‘కడా’కెళ్లండి!
  •      వైద్యశాఖలో 53 మందికి ఆకస్మిక బదిలీలు
  •      నేడు విధుల్లో చేరాలంటూ కలెక్టర్ ఆదేశాలు
  •      కౌన్సెలింగ్ లేకనే బదిలీలా అంటూ ఆవేదనలో ఉద్యోగులు
  •      రంగంలోకి దిగిన ఉద్యోగ సంఘ నాయకులు
  • పలమనేరు: సీఎం నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండరాదనే ఉద్దేశంతో జిల్లాలోని పలువురు వైద్య సిబ్బందిని బదిలీ చేస్తూ కలెక్టర్ సిద్ధార్థజైన్ హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది మంగళవారం సంబంధిత ఆస్పత్రుల్లో విధు ల్లో చేరాలని ఆయన డీఎంఅండ్‌హెచ్‌వో దశరథరామయ్యను ఆదేశించారు. ముందస్తు సమాచారం లేకుండా, కనీ సం కౌన్సెలింగ్ కూడా నిర్వహించకుం డా ఉన్న ఫలానా బదిలీలు చేయడమేంటని వైద్యశాఖకు చెందిన పలువురు పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద సీఎం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారిస్తుందనేందుకు ఇదే నిలువెత్తు నిదర్శనం.

    జిల్లాలోని నలు మూలలకు చెందిన ఐదుగురు డాక్టర్లు, 29 మంది ఏఎన్‌ఎంలు, పలువురు ల్యాబ్ టెక్నీషియన్లు, కొందరు మైక్రో స్కోపిస్ట్‌లు వెంటనే కుప్పంకు వెళ్లాలని కలెక్టర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇది జరిగి మూడు రోజులైనా సంబంధిత శాఖలో బదిలీ చేసే అవకాశమున్న జాబితాను తయా రు చేసే పనిలో డీఎంఅండ్‌హెచ్‌వో బిజీగా ఉండడంతో అమలు చేయడం కాస్త ఆలస్యమైంది. దీనిపై తిరిగి కలెక్టర్ నుంచి సోమవారం మరోసారి డీఎంఅండ్‌హెచ్‌వోకు సమాచారమందినట్టు తెలుస్తోంది.

    మంగళవారం సాయంత్రం లోపు కడాలో విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలి సింది. బదిలీ అయిన వారు జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాలకు చెందిన వారని తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభమై పిల్లలు పాఠశాలలకెళ్తున్న తరుణంలో ఈ బదిలీలతో ఇబ్బందులు తప్పవని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు ఉద్యోగులు సోమవారం డీఎంఅండ్‌హెచ్‌వోను కలసి తమ ఆవేదన వెళ్లబోసుకున్నట్లు సమాచారం.

    ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పినట్టు సమాచారం. కనీసం ఓ జీవో కూడా విడుదల చేయకుండా యుద్ధప్రాతిపదికన ఈ ఆదేశాలు ఏంటంటూ ఇప్పటికే వైద్య ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై వీరు కలెక్టర్‌ను కలసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నట్లు తెలిసింది. ఈ విషయమై డీఎంఅండ్‌హెచ్‌వో దశరథరామయ్యను వివరణ కోరగా వాస్తవమేనన్నారు. వీరంతా రెండు రోజుల్లో కుప్పంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుం దని తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement