
‘రాజకీయ నేతలకు కొత్త ఏడాది గడ్డుకాలమే'
హేవిళంబి నామ సంవత్సరంలో రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేవారికి ఇబ్బందులు తప్పవని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.
విశాఖ : హేవిళంబి నామ సంవత్సరంలో రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేవారికి ఇబ్బందులు తప్పవని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. గ్రహాల స్థితిగతులు అనుకూలంగాల లేనందున ఎండలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ కాలసర్ప దోషం ఉందని, రాజకీయ నేతలకు కొత్త ఏడాది గడ్డుకాలమేనని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. ప్రభుత్వం విజ్ఞతతో యజ్ఞయాగాలు చేస్తే మేలు జరగవచ్చని అన్నారు. అలాగే దేశంలో భూకంపాలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.