హథీరాంజీ మఠంలో పెళ్లిళ్లపై విచారణ: టీటీడీ ఈవో | ttd eo said that enquiry on wedlock cermonies in hathiramji mutt | Sakshi
Sakshi News home page

హథీరాంజీ మఠంలో పెళ్లిళ్లపై విచారణ: టీటీడీ ఈవో

Mar 6 2015 11:36 PM | Updated on Jul 11 2019 5:12 PM

తిరుమలలోని హథీరాంజీ మఠంలో ఇటీవల ‘మరుమాంగళ్యం’ పేరుతో నిర్వహించిన పెళ్లిళ్లపై విచారణ చేయిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు.

తిరుమల: తిరుమలలోని హథీరాంజీ మఠంలో ఇటీవల ‘మరుమాంగళ్యం’ పేరుతో నిర్వహించిన పెళ్లిళ్లపై విచారణ చేయిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. వివాహాలు అయిన జంటలకే తిరిగి పెళ్లిళ్లు చేసినట్టు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈవో పైవిధంగా బదులిచ్చారు. మరుమాంగళ్యం పేరుతో వివాహాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.

 

ఇందులో వాస్తవ పరిస్థితులు ఏమిటి? భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా? అన్న విషయాలపై ఆరా తీస్తామన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement