అనంతపురం జిల్లా తాడిమర్రి ఎస్సీ కాలనీకి చెందిన బండారు నాగరాజు ఇంట్లో రూ.15వేల నగదుతోపాటు జత బంగారు కమ్మలను దొంగలు ఎత్తుకుపోయారు.
అనంతపురం జిల్లా తాడిమర్రి ఎస్సీ కాలనీకి చెందిన బండారు నాగరాజు ఇంట్లోఆదివారం రాత్రి చోరీ జరిగింది. బీరువాలో ఉంచిన రూ.15వేల నగదుతోపాటు జత బంగారు కమ్మలను దొంగలు ఎత్తుకుపోయారు. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిందని బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.