2 నెలల్లో పూర్తికానున్న చదువు.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
విజయవాడ(రామవరప్పాడు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించింది. ఏపీలోని ప్రసాదంపాడు బీఎమ్పీఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న చుండూరి విష్ణువర్ధన్, కోటేశ్వరీ దంపతులకు ముగ్గురు సంతానం. జ్యోత్స్న, తరుణ్ సాయి ఇంజినీరింగ్ చదువుతున్నారు. పెద్ద కుమార్తె సాయి తేజస్వీ ఎమ్ఎస్ చేయడానికి అమెరికాకు 16 నెలల కిందట వెళ్లిం ది. నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీలో విద్య ను అభ్యసిస్తోంది.కాలిఫోర్నియాలో సోమవారం రాత్రి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. వెంటనే తేజస్వీని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది.
చిన్నతనం నుంచి చదువులో ముందంజ
చిన్నతనం నుంచి తేజస్వీ చదువులో ముందుండేది. చదువుపై ఉన్న ఇష్టాన్ని గమనించి రైతు అరుున తండ్రి విష్ణువర్ధన్ ఆమెను కష్టపడి చదివించాడు. అమెరికాలో ఎమ్ఎస్ చేయడానికి పంపించారు. మరో రెండు నెలల్లో చదువు పూర్తి కానుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మంచి ఉద్యోగంలో స్థిరపడి మన కుటుంబాన్ని దేనికి లోటు లేకుండా బాగా చూసుకుంటానని తరచూ అంటుండేదని కుటుంబ సభ్యులు విలపిస్తూ తెలిపారు. కాగా, సారుు తేజస్వి మృతదేహం అమెరికా నుంచి దేశానికి త్వరగా వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి అరుు్యందని తెలిపారు. అక్కడి నుంచి మృతదేహం త్వరగా వచ్చేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాలని కోరుతున్నారు.
అమెరికాలో తెలుగు యువతి మృతి
Published Thu, Dec 1 2016 12:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement