వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది.
కడప : వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 20మంది కౌన్సిలర్లు ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 జెడ్పీటీసీల బలం ఉండగా, టీడీపీకి కేవలం రెండు జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నా టీడీపీ ...ప్రలోభాలకు గురి చేస్తోంది. ప్రజాతీర్పుకు భిన్నంగా అనైతిక పద్ధతుల్లో జెడ్పీపీఠాన్ని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు.. అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ప్రస్పుటం అవుతోంది.