18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అన్ని కళాశాలల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమాలను చేపట్టాలని
కళాశాలల్లో ప్రత్యేకంగా ఓటరు నమోదు..
Aug 29 2013 4:11 AM | Updated on Sep 1 2017 10:12 PM
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్లైన్: 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అన్ని కళాశాలల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కన్సల్టెంట్ పహీమ్ షాబేరీ సూచించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఇతర అధికారులతో ఓటర్ల జాబితా పై చర్చించారు. 18 సంవత్సరాల వయసు ఉన్న వారందరికీ ఓటుహక్కు కల్పించినా, మొత్తంఓటర్లలో 18 నుం చి 21 సంవత్సరాల వయసు ఉన్న వారు 1.5 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు.
వయోజనులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుంటేనే ఓటు హక్కును పొందగలుగుతారనే చైతన్యాన్ని కలిగించాలని చెప్పారు. ఓటర్ల నమోదును ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్తో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. కళాశాలల యాన్యువల్ డేస్, ఫ్రెషర్స్డేలలో నమోదు చేపట్టాలని కోరనున్నట్లు పేర్కొన్నా రు. ఖమ్మంలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రూ.50లక్షలతో చేపట్టిన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ జేసీ, డీఆర్వో, ఏవో,ఆర్డీవోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement