ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం | Special Session of Andhra Pradesh Assembly on January 20 | Sakshi
Sakshi News home page

ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Jan 11 2020 2:11 PM | Updated on Jan 11 2020 5:58 PM

Special Session of Andhra Pradesh Assembly on January 20 - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధాని సహా రాష‍్ట్రంలో  అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఇచ్చిన నివేదిక, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.  అలాగే ఈ నెల 18న కేబినెట్‌ భేటీ కానుంది. 

చదవండి:

అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి

అందరి అభిప్రాయాలు తీసుకుంటాం

ముగిసిన హై పవర్ కమిటీ భేటీ

వికేంద్రీకరణకే పెద్దపీట

Advertisement
 
Advertisement
Advertisement