తుళ్లూరులో సింగపూర్ బృందం రహస్య పర్యటన | singapore officials visits tulluru | Sakshi
Sakshi News home page

తుళ్లూరులో సింగపూర్ బృందం రహస్య పర్యటన

Apr 19 2015 3:51 PM | Updated on May 29 2019 3:19 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లురులో ఆదివారం సింగపూర్ బృందం తమ రహస్య పర్యటనను కొనసాగిస్తోంది.

గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఆదివారం సింగపూర్ బృందం రహస్య పర్యటన చేపట్టింది. ఈ మేరకు 17 మంది సింగపూర్ ప్రతినిధులు పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం ఆ బృంద సభ్యులు సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్ తో సమావేశమయ్యారు. 

 

దీనిపై ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే వీరి పర్యటన కొనసాగుతోంది. రాజభవన్ భవన నిర్మాణం, హైకోర్టు తదితర అంశాలకు సంబంధించి ఈ బృందం తుళ్లురులో పర్యటన చేపట్టింది. దీనికి సంబంధించి మే 15 లోగా సింగపూర్ బృందం ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వనున్నట్లు ఏపీ మంత్రులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement