కడప రూరల్: గడిచిన 2013-14 ఆర్థిక సంవత్సరం అస్తవ్యస్తంగా సాగింది. అలాంటి తరుణంలోనే నాటి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు లక్ష్యాలను, బడ్జెట్ (సబ్సిడీ)ను ఘనంగా కేటాయించింది. దీంతో ఆయా వర్గాలు ఎంతో సంతోషం వ్యక్తం చేశాయి. సబ్సిడీ రుణాలతో లబ్ధి పొందవచ్చని అందరూ భావించారు. అయితే, అనుకున్నదొకటి... జరిగింది మరొకటి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులు రుణాలు అందక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
అన్నీ కష్టాలే!
గడిచిన ఆర్థిక సంవత్సరంలో రుణాల ప్రక్రియ కష్టాలతో ప్రారంభమైంది. రుణ మంజూరుకు కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. బ్యాంకు లింకేజీ కింద రుణాల మంజూరుకు ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీని జమ చేసేలా చర్యలు చేపట్టింది. ఈ విధానంతో తమకు సబ్సిడీ నేరుగా బ్యాంకులలో పడుతుందని, తద్వారా రుణ మొత్తాన్ని పొందవచ్చని ఆశపడ్డారు. అనంతరం గడిచిన డిసెంబరు 31వ తేదీన రుణాల మంజూరు ప్రక్రియకు సంబంధించి 101 జీఓను ప్రభుత్వం జారీ చేసింది.
ఆ జీఓ ప్రకారం వయస్సు నిబంధనను విధించారు. రేషన్కార్డును తప్పనిసరి చేశారు. దీంతో రుణాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఎంతోమంది ఆ జీఓ కారణంగా అనర్హులుగా మారారు. మిగిలిన కొంతమంది నిబంధనల ప్రకారం రుణ అర్హతను పొందారు. అర్హతను పొందిన వారు తమకు రుణాలు వస్తాయని ఆశపడ్డారు. అయితే, వారి ఆశ నిరాశగా మారింది. ప్రభుత్వం లక్ష్యాలను ఆలస్యంగా ప్రకటించింది. అంతలోనే ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఫలితంగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది.
ఈ తరుణంలో ప్రభుత్వం సకాలంలో స్పందించక పోవడం వల్ల అతికొద్ది మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. ఈ నేపథ్యంలో కోడ్ ముగిసింది...తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నెలలు గడుస్తున్నప్పటికీ రుణాల ఊసే లేకపోవడం, సబ్సిడీ నిధుల ప్రస్తావనే వినిపించకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వారు అసలు రుణాలు వస్తాయా? రావా? అనే సందిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే గతంలో కూడా రుణానికి అర్హత పొందినప్పటికీ ఆయా శాఖలకు ప్రభుత్వం సబ్సిడీ నిధులను కేటాయించకపోవడం వల్ల రుణాలు పొందలేక పోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే అనుమానం అర్హుల్లో గూడు కట్టుకుంది.
ఎస్టీ బీసీల పరిస్థితి దారుణం
కాగా, ఎస్టీలకు 194 యూనిట్లు, అందుకోసం రూ. 1.38 కోట్ల సబ్సిడీని కేటాయించారు. అలాగే బీసీ వర్గాలకు 3134 యూనిట్ల కోసం రూ. 9.40 కోట్ల సబ్సిడీని కేటాయించగా, ఆయా వర్గాలకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాకపోవడం, ఒక్కరు కూడా రుణాలు పొందలేకపోయారు. దీంతో ఆయా వర్గాలు తమకు రుణాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు.
2014-15 రుణాలకు మోక్షం ఎప్పుడో?
సాధారణంగా ప్రతి యేటా జూలైలో ఆయా శాఖలకు రుణ లక్ష్యాలను, బడ్జెట్ కేటాయింపులను నిర్దేశిస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2013-14కు సంబంధించిన రుణాలే పూర్తి కాలేదు. ఇక ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరానికి రుణాలను ప్రభుత్వం ఎప్పుడు కేటాయిస్తుందో అంతుచిక్కడం లేదు. ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు చెందిన వారు రుణాల ద్వారా లబ్ధి పొందాలని భావించారు. అయితే రుణాలు మంజూరయ్యే పరిస్థితి కనుచూపు మేర కనిపించకపోవడంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
రుణం.. గగనం
Published Tue, Jul 22 2014 4:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement