పట్నంబజారు(గుంటూరు) : ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మంగళవారం ఏడో రోజు ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ ఎదుట భారీ సంఖ్యలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ కార్మికుల ఆందోళనకు మద్దతుగా నిలిచాయి. తొలుత ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీ, కార్మిక సంఘాల నేతలు బస్టాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు.
సుమారు 45 నిముషాలకు పైగా మానవహారంగా ఏర్పడడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మహిళా కార్మికులు చంటి బిడ్డలతో సైతం ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ లోపలికి చేరుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ లోపలి నుంచి బయటకు వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకుని, శాంతియుతంగా ఆందోళన చేయాలని కార్మిక సంఘాల నేతలకు సూచించారు.
బస్సులను నిలిపిన సమయంలో టైర్లలోని గాలి తీయడానికి యత్నించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం వదిలిపెట్టారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్వలి, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఎన్వీకే రావు, మందపాటి శంకర్రావు, సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు భావన్నారాయణ, కోటా మాల్యాద్రి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, నేతాజీ పాల్గొన్నారు.
ఉధృతమైన సమ్మె
గుంటూరు రీజయన్ పరిధిలో మంగళవారం పలు చోట్ల బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహిం చారు. గత రెండు రోజుల నుంచి కార్మిక సం ఘాలు ఆందోళనలు మరింత ఉధృతం చేశా యి. ఆర్టీసీ అధికారులు కాంట్రాక్ట్, తాత్కాలిక సిబ్బందితో సర్వీసులు పునరుద్ధరించే ప్రయత్నం చేసినా అంతంతమాత్రంగానే తిరిగాయి.
నేడు నిరసన ప్రదర్శన...
ఆర్టీసీ కార్మికులు రీజియన్ పరిధిలో నేడు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. 13 డిపోల్లోనూ కళ్ళకు గంతలు కట్టుకుని ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఎంప్లాయీస్ యూనియన్ రీజయన్ అధ్యక్షుడు ఎన్వీకే రావు తెలిపారు. కార్మిక సంఘాలకు రాజకీయపార్టీలు తోడుగా నిలవనున్నాయి.
ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో, మానవహారం
Published Wed, May 13 2015 4:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement