చికిత్సపొందుతూ వ్యక్తి మృతి | road accident victim dies in hospital | Sakshi
Sakshi News home page

చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

Aug 17 2015 11:23 AM | Updated on Apr 3 2019 8:07 PM

గోదావరి పుష్కరాలకు వెళుతూ రోడ్డుప్రమాదంలో గాయపడి వైజాక్‌లో చికిత్సపొందుతున్న వ్యక్తి సోమవారం ఉదయం మరణించాడు.

శ్రీకాకుళం జిల్లా: గోదావరి పుష్కరాలకు వెళుతూ రోడ్డుప్రమాదంలో గాయపడి వైజాక్‌లో చికిత్సపొందుతున్న వ్యక్తి సోమవారం ఉదయం మరణించాడు. వీరఘట్టంకు చెందిన నలుగురు వ్యక్తులు  గతనెల17న కారులో పుష్కరాలకు బయలుదేరారు. భోగి చంద్రమౌళి(65) రాజమండ్రి వద్ద కారు ఆపి టిఫెన్ చేసేందుకు రోడ్డుదాటుతుండగా లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో చంద్రమౌళి తీవ్రంగా గాయపడ్డాడు. అయనకు రాజమండ్రిలో చికిత్సచేయించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement