ఎడ్లబండిని ఢీకొన్న లారీ: ఒకరి మృతి | road accident in kurnool distirict | Sakshi
Sakshi News home page

ఎడ్లబండిని ఢీకొన్న లారీ: ఒకరి మృతి

Mar 9 2015 11:18 AM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టింది.

కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బండిలో ఉన్న రైతు నరసింహలు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు రెండు ఎద్దులు మృతిచెందాయి. నరసింహులు స్వగ్రామం కోస్గి మండలం పల్లెపాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
(మంత్రాలయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement