రంగురాళ్ల తవ్వకాల్లో వివాదం.. | Rangurallu excavated controversy .. | Sakshi
Sakshi News home page

రంగురాళ్ల తవ్వకాల్లో వివాదం..

Nov 23 2015 3:46 PM | Updated on May 3 2018 3:17 PM

అనధికారికంగా రంగురాళ్లు తవ్వుతున్న రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

అనధికారికంగా రంగురాళ్లు తవ్వుతున్న రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా గొలుగుండ మండలం పప్పు శెట్టిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

గ్రామంలోని క్వారీలో రంగురాళ్లు తవ్వుతున్న రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. అనంతరం కర్రలతో దాడులు చేసుకోవడంతో.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన తోటి కూలీలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement