నేడు తిరుమలలో శ్రీవారికి పుష్పయాగం | Pushpa Yaga Mahotsvam at Tirumala | Sakshi
Sakshi News home page

నేడు తిరుమలలో శ్రీవారికి పుష్పయాగం

Nov 10 2013 8:11 AM | Updated on Aug 20 2018 4:09 PM

తిరుమలలో కొలువైన దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం నిర్వహిస్తుంది.

తిరుమలలో కొలువైన దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం నిర్వహిస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు టీటీడీ ఆదివారం వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్ననం 1.00 గంట నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగం జరుగుతుందని తెలిపింది.

 

పుష్పయాగం నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. దాదాపు 7 టన్నుల పుష్పాలను ఆ యాగానికి వినియోగించనున్నట్లు చెప్పింది. అయితే శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన  భక్తులతో తిరుమల పొటెత్తింది. ఉచిత దర్శనానికి 5 గంటలు,శ్రీఘ్ర దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement