ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు | power bills hiked in ap | Sakshi
Sakshi News home page

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు

Mar 23 2015 5:16 PM | Updated on Jun 2 2018 2:56 PM

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు - Sakshi

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు

ఆంధ్రప్రదేశ్లో మళ్లీ విద్యుత్ ఛార్జీలను పెంచారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మళ్లీ విద్యుత్ ఛార్జీలను పెంచారు. నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తే 5 శాతం మేర ఛార్జీలు పెంచనున్నారు. సోమవారం సాయంత్రం ఏపీఈఆర్సీ విద్యుత్ టారిఫ్ను ప్రకటించింది.

200 యూనిట్ల లోపు వాడే గృహ వినియోగదారులకు ఛార్జీల పెంపుదల వర్తించదు. వ్యయసాయం, కుటీర పరిశ్రమలకు మినహాయింపు నిచ్చారు. చక్కెర, పౌల్ట్రీ పరిశ్రమలకు కూడా పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు.

వివరాలు..

200 దాటితే యూనిట్ ధర 6.38 నుంచి 6.70 రూపాయలకు పెంపు
250 దాటితే యూనిట్ ధర 6.88 నుంచి 7.22 రూపాయలకు పెంపు
300 దాటితే యూనిట్ ధర 7.38 నుంచి 7.75 రూపాయలకు పెంపు
400 దాటితే యూనిట్ ధర 7.88 నుంచి 8.27 రూపాయలకు పెంపు
500 దాటితే యూనిట్ ధర 8.38 నుంచి 8.80 రూపాయలకు పెంపు
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement