పవన్‌ కల్యాణ్‌ బౌన్సర్లకు గాయాలు | Pawan Kalyan Bouncers Vehicle Accident In East Godavari | Sakshi
Sakshi News home page

Nov 15 2018 9:59 PM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Bouncers Vehicle Accident In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బౌన్సర్లు ప్రయాణిస్తున్న వాహనం గురువారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. రంగంపేట వద్ద వీరి వాహనం ఓ లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. రాజానగరంలో ఏర్పాటు చేసిన పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన 9 మందిని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా.. రాజానగరం సభ అనంతరం పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement