పవన్‌ కల్యాణ్‌ బౌన్సర్లకు గాయాలు

Pawan Kalyan Bouncers Vehicle Accident In East Godavari - Sakshi

రంగంపేట వద్ద రోడ్డు ప్రమాదం

9 మందికి గాయాలు

క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం

సాక్షి, తూర్పుగోదావరి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బౌన్సర్లు ప్రయాణిస్తున్న వాహనం గురువారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. రంగంపేట వద్ద వీరి వాహనం ఓ లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. రాజానగరంలో ఏర్పాటు చేసిన పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన 9 మందిని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా.. రాజానగరం సభ అనంతరం పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయినట్టు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top