పశ్చిమ గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ...
రాజమండ్రి : పశ్చిమ గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన నడుస్తున్నవారిపై దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.