కౌలు డబ్బు అడిగితే హత్య! | Murder in Uttaragudem | Sakshi
Sakshi News home page

కౌలు డబ్బు అడిగితే హత్య!

May 16 2015 5:35 PM | Updated on Jul 30 2018 8:29 PM

కౌలు డబ్బు అడగటానికి వచ్చిన ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ఓ మహిళను హత్య చేశాడు.

ఏలూరు: కౌలు డబ్బు అడగటానికి వచ్చిన ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ఓ మహిళను హత్య చేశాడు.  మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం దొడ్డనపూడి శివారు ఉత్తరగూడెంలో ఉండే నాగరాజు వద్దకు అతని వదిన లక్ష్మీఝాన్సీ, ఆమె తల్లి నాగమణి వెళ్లారు.

కౌలు డబ్బులు ఇవ్వడంలేదేమిటని  నాగరాజును ప్రశ్నించి, డబ్బు ఇవ్వమని  అడిగారు. దాంతో నాగరాజు కత్తి తీసుకుని వారిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగమణి మృతి చెందింది.   లక్ష్మీఝాన్సీకి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement