అనంతపురం జిల్లా హిందూపురంలోని మానెసముద్రం గ్రామంలో మట్కా ఆడుతున్న వారిపై టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం మెరుపుదాడి చేశారు.
హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలోని మానెసముద్రం గ్రామంలో మట్కా స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో మట్కా ఆడుతున్న ముగ్గుర్ని అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.90 వేల నగదు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.