వ్యక్తి దారుణ హత్య | man murdered in guntur distirict | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Oct 8 2015 10:21 AM | Updated on Aug 29 2018 8:36 PM

పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు.

నగరం: పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నగరం మండలం పూడివాడ పడమటి పాలెం గ్రామంలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన మోర్ల వెంకటసాంబశివరావు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు గ్రామ శివారులో సాంబశివరావు మృత దేహమై కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగి దాదాపు రెండు రోజులై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement