వ్యక్తి దారుణ హత్య | Man killed in tuni, murder suspected | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Apr 2 2017 12:53 PM | Updated on Jul 30 2018 8:37 PM

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్‌.అన్నవరంలో ఆదివారం దారుణ హత్య జరిగింది.

తుని: తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్‌.అన్నవరంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. బాబ్జీ(40) అనే వ్యక్తి తన ఇంటికి సమీపంలో హత్యకు గురయ్యాడు. సిమెంటు రాయితో తలపై బలంగా మోదడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు పాత గోనె సంచులు కొనడం, అమ్మడం చేస్తుంటాడు. ఇతనికి మద్యం అలవాటు ఉందని.. ఆ సందర్భంగా ఏదైనా గొడవ జరిగిన కారణంగా హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement