నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

Published Sun, Jun 21 2015 10:30 PM

light earth quake effected in Nellore district

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. దాంతో అక్కడి ప్రజలు భయంతో ఇళ్లనుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందులోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలుగ్రామాలు విద్యుత్ లేక అంధకారంలో మునిగిపోయాయి.

ఈ సమయంలో హఠాత్తుగా భూమి కంపించడంతో నెల్లూరు జిల్లా వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే వర్షం బీభత్సానికి అల్లాడిపోతున్న ప్రజలకు భూకంపం రావడంతో భయాందోళనలకు గురయ్యారు.

Advertisement
Advertisement