భార్యను చంపిన కేసులో భర్తకు జీవితఖైదు | life time punishment for the case of killing his wife | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన కేసులో భర్తకు జీవితఖైదు

Jan 23 2015 5:44 PM | Updated on Jul 29 2019 5:43 PM

చిత్తూరు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి భార్యను చంపిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

మదనపల్లి (చిత్తూరు): చిత్తూరు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి భార్యను చంపిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాలు.. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలానికి చెందిన రవికుమార్ (38) తాగుడుకు బానిసై భార్యను చిత్ర హింసలకు గురిచేసి 2013లో గొంతు కోసి చంపేశాడు.

అప్పట్లో ఈ కేసు పూర్తిస్థాయి విచారణకు ధర్మాసనం ఆదేశించింది. తాజాగా శుక్రవారం నాడు అదనపు జిల్లాకోర్టు న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువడించారు. ఈ తీర్పుతో మృతురాలి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement