ఉద్రిక్తంగా మారిన భూసేకరణ సభ | land aquisition meet turns violent with protests | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా మారిన భూసేకరణ సభ

Nov 14 2014 3:37 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం గుంటూరు ప్రాంతంలో మంత్రివర్గ ఉపసంఘం చేపట్టిన అభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం గుంటూరు ప్రాంతంలో మంత్రివర్గ ఉపసంఘం చేపట్టిన అభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. ల్యాండ్ పూలింగ్కు తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయ భూములు ఎక్కడ ఇస్తారో ముందుగానే చెప్పాలని రైతులు నిలదీశారు.

కొంతమంది రైతులు నేరుగా తమ భూములు ఇవ్వలేమని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం ఇవ్వజూపుతున్న పరిహారం తమకు సరిపోదన్నారు. ప్రత్యామ్నాయాలపై మంత్రులను నిలదీశారు. ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement