నేటికీ ప్రారంభంకాని కృష్ణానదిపై వంతెన పనులు
వెంకటపాలెం నుంచి గొల్లపూడి వరకు నిర్మాణం
రూ. 1940 కోట్ల వ్యయంతో టెండర్ అప్పగింత
30 నెలల్లో పూర్తి చేయాలని నిబంధనలు
ఏడాది పూర్తవుతున్నా పునాదికి నోచని వైనం
రెండు జిల్లాలకు వారధి....
మూడు కిలోమీటర్లకు పైగా వంతెన...
దాదాపు రూ.1940 కోట్ల వ్యయం...
టెండర్ అప్పగించి ఏడాది. నేటికీ పనులు ప్రారంభి ంచని సంస్థ...కిమ్మనని ప్రభుత్వం...
రాజధాని ప్రాంతంలో ప్రజల ఎదురు
తెన్నులు..నిర్మాణం పూర్తవుతుందా లేదా...
ప్రారంభమే లేని చోట కార్యరూపం
దాల్చ గలదా అనే సందేహం...
చివరకు ప్రారంభానికి నోచని ప్రాజెక్టుగా
మిగులుతుందా అనే అనుమానం..!
తాడికొండ: అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు గత ఏడాది ప్రభుత్వం మంజూరు చేసిన కృష్ణానదిపై వంతెన నిర్మాణం నేటికీ ప్రారంభమే కాలేదు. గత ఏడాది సెప్టెంబరులో తుళ్లూరు మండలం వెంకటపాలెం 6/0 కిలోమీటరు వద్ద నుంచి కృష్ణాజిల్లా గొల్లపూడి వద్ద కృష్ణానదిపై 3 కిలోమీటర్ల 100 మీటర్ల పొడవ ునా వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1940 కోట్లతో టెండరు పిలిచింది. గామన్ఇండియా సంస్థ ఈ టెండరును దక్కించుకుంది. 30 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ నేటి వరకు పనులే ప్రారంభించలేదు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పనులు మొదలు పెట్టలేదని సమాచారం.
దీనిపై నేషనల్హైవే అధికారులు సదరు సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా ఆస్ట్రేలియా కంపెనీతో కలసి త్వరలో పనులు ప్రారంభిస్తామని తిరుగు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఆస్ట్రేలియా కంపెనీ దేశంలో ఇప్పటికి 9 చోట్ల ఇటువంటి వంతెన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసింది. దీంతో ఆ కంపెనీతో కలసి పనిచేసేందుకు గామన్ ఇండియా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వంతెన నిర్మాణానికి కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు 90 శాతం భూములు కూడా ఇచ్చారు. నిర్మాణ వ్యయం రూ.1940 కోట్లలో రూ.300 కోట్లు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించారు. కొందరు రైతులు మాత్రం భూసమీ కరణను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. వారికి సంబంధించిన ప్యాకేజీ కూడా ఉన్నతాధికారుల వద్ద డిపాజిట్ చేశారు. అయితే నేటికీ వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు.
మాస్టర్ ప్లాన్లో మరో రెండు వంతెనలు
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా మరో రెండుచోట్ల కృష్ణానదిపై వంతెనలు నిర్మించేందుకు మాస్టర్ప్లాన్లో పొందుపరిచారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం నుంచి ఇబ్రహీంపట్నం వరకు, అమరావతి నుంచి చెవిటికల్లు వరకు వంతెన నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రభుత్వం వంతెన నిర్మాణాలు చేపడితే గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య పడవ ప్రయాణాలు తప్పుతాయి.
కలలా వారధి
Published Tue, Aug 11 2015 4:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement